Tuesday, April 23, 2024
- Advertisement -

మరో స్టార్ హీరోయిన్ ని పట్టేసిన నితిన్..!

- Advertisement -

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ఇటీవల వరుసగా ఆయన తన సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ సినిమా అంధాధూన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మ్యాస్ట్రో అనే పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. ఈ సినిమాతో పాటు కొత్త దర్శకుడు శేఖర్ తో ఓ సినిమా చేయనున్నాడు నితిన్. దీంతో పాటు రైటర్ కమ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో మరో సినిమా నితిన్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు టాక్.

హీరో నితిన్ తన సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోయిన్లను నటింపజేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడే కాదు ఆయన కెరీర్ ఆరంభం నుంచి ఇలాగే సాగుతోంది. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న జెనీలియా, ఇలియానా, త్రిష, వంటి అగ్ర హీరోయిన్లతో నితిన్ నటించారు. ఎక్కువగా టాలీవుడ్ టాప్ హీరోలతో నటించే సమంతతో కూడా నితిన్ అఆ సినిమాలో నటించాడు.

ఇప్పుడు తాజాగా మరో అగ్ర హీరోయిన్ ను తన సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు నితిన్. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతేకాదు తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలను చేస్తోంది. అంత బిజీగా ఉన్న పూజా హెగ్డే నితిన్ తన కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్.వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నితిన్ సరసన పూజా హెగ్డే ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందు కోసం పూజా హెగ్డే కాల్షీట్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read

దూసుకుపోతున్న మెగా మేనల్లుడు..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

బాలయ్యకు నో చెప్పిన టబు.. అందుకేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -