Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

- Advertisement -

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. పొలిటికల్ నేపథ్యంలో ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారు. సినిమా టైటిల్ గా ‘అయినను పోయిరావలె హస్తినకు’అని కూడా పెట్టారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగియగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా కొద్ది రోజులు ఎదురు చూశాడు కూడా.

అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ముగియగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని, అందువల్లే ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా తర్వాత కూడా తదుపరి సినిమాను అంగీకరించారు. ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నారు.

ఎన్టీఆర్ నుంచి వరుసగా రెండు సినిమాలు ప్రకటించడంతో ఇక త్రివిక్రమ్ సినిమా రేసులో లేనట్టేనని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఆగిపోలేదని తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తాడని టాక్. ఇదివరకు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read

ఎన్టీఆర్, చరణ్ ల మీద సాంగ్.. చిత్రీకరణకే 20 రోజులు..!

మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -