ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్స్టోరి”రాధేశ్యామ్” మూవీ ఇప్పటికే భారీ అంచనాలు నడుమ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ తదుపరి సినిమా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో”సలార్”సినిమాలో నటిస్తున్నాడు. అలాగే పౌరాణిక నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “ఆది పురుష్” మూవీని టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమా కోసం టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ ప్రభాస్కు యాభై కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా నటిస్తోంది. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే సంవత్సరం అగష్టు 11న తెలుగు, హిందీ, తమిళం, భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also read:పుష్ప సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్.. ఎవరంటే?
ప్రభాస్ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు ఐదు వందల కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను సెలెక్ట్ చేయగా, మరో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు అన్న విషయం ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించాడు.
Also read:హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?