చాలా రోజుల తర్వాత సలార్తో బాక్సాఫీస్ని షేక్ చేశారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్తో హిట్ ట్రాక్ బాట పట్టగా ఏడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీ సుకుమారన్ కీ రోల్ పోషించారు.
సలార్ సీజ్ ఫైర్తో తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే దిశగా దూసుకెళ్తున్నారు ప్రభాస్. అయితే సలార్కు పాజిటివ్ టాక్తో పాటు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనిపై స్పందించారు ప్రశాంత్ నీల్. సలార్ కి పాజిటివ్, నెగిటివ్ రెండు టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ మాత్రం చాలా బాగున్నాయని వెల్లడించారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందని వెల్లడించారు.
ఈ సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు రాగా ప్రశాంత్ నీల్ కూడా సలార్ కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓ సినిమా కోసం ఇలా హీరో – దర్శకుడు ఇద్దరూ చెరో 100 కోట్లు తీసుకోవడం విశేషం.