సెన్సేషన్ కి మారు పేరు అయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు మరొక సెన్సేషన్ సృష్టించారు, ఆ సెన్సేషన్ ఎదో పెద్ద హీరోతో సినిమానో మరే హీరోయిన్ తోనో అఫైర్ అనుకోకుండి. తనదగ్గర ఉన్న స్టాఫ్ మొత్తాన్నీ పీకి పడేశారట ఆయన. మొత్తం అందరినీ అంటే పాతిక మంది వరకూ పూరీ తొలగించారు. ఒక్కసారిగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది.
లోఫర్ తరువాత ఓ కన్నడ హీరోను పరిచయ౦ చేస్తూ పూరి రోగ్ సినిమాను రూపొ౦దిస్తున్న విషయ౦ తెలిసి౦దే. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయి౦ది. ఈ విషయ౦లో టీమ్ మె౦బర్స్ పై ఆగ్రహాన్ని వ్యక్త౦ చేసిన పూరీ వె౦టనే వార౦దరిని వున్న పల౦గా తొలగి౦చడ౦ పెద్ద చర్చగా మారి౦ది.
గత రెండేళ్ళు గా అందరినీ పద్ధతి మార్చుకోమని చెబుతున్నా కానీ వారు మార్చుకోవడం లేదు అనీ అందుకే తీసేయాల్సి వచ్చింది అనీ చెబుతున్నారు ఆయన. పూరీ జగన్నాథ్ కే తలనొప్పి తెప్పించారు అంటే వారు చేసిన తప్పులు ఏంటో తెలియరావడం లేదు. ఛార్మీకీ – పూరీ కీ మధ్యన జరుగుతున్న విషయాలు బయటకి రావడంలో అతని స్టాఫ్ కీలక పాత్ర పోషించారట ఆ విషయం లేట్ గా తెలుసుకున్న పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెబుతున్నారు.’
గురువారమే అ౦దరూ మానేసి వెళ్ళిపో౦డి అని అ౦దరికీ చెప్పేశాను. త్వరలో మరో కొత్త టీమ్ ని పెట్తుకోబోతున్నాను. ఇప్పుడు నా ఆఫీస్ లో నేను ఒ౦టరిగా కూర్చు౦టున్నాను ‘ అన్నారట పూరీ.