Wednesday, May 15, 2024
- Advertisement -

చార్మీతో పూరి భార్యకి గొడవకు కారణం ఇదే

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదంపై ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు, చిన్నా, శ్రీనివాసరావు ఇలా టాలీవుడ్ స్టార్స్ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ మత్తులో వీరు మునిగి తెలుతున్నట్లు.. ఈ విషయం బయటకు రాకుండా వీరు చాలా జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తో సంబంధాలు కలిగి ఉన్న లిస్టు బయటకు రావడంతో టాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ ను విచారించి, అతడి కాల్ డేటా, వాట్సాప్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపించారు. ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించబోతున్నామని అధికారులు వారిని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే, డ్రగ్స్ రాకెట్ లో కీలకమైన కెల్విన్ నాలుగేళ్ళ క్రితమే సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం. అయితే ఈ విషయం కొద్ది సేపు పక్కన పెడితే.. గతంలో పూరి జగన్నాథ్ తో హీరోయిన్ చార్మికి లింక్ ఉందని చాలా రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇదే విషయంపై పూరి భార్య చార్మికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. పూరి జగన్నాథ్ తో చార్మి డ్రగ్స్ తీసుకునేదట. అందుకోసమే పూరి ఇంటికి రోజు చార్మి వచ్చేదని.. ఈ విషయం పూరి తన భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేవాడని.. చాలా సార్లు.. పూరి ఇంట్లోనే చార్మి డ్రగ్స్ తీసుకునేదని తెలుస్తోంది. కానీ ఓ రోజు ఈ విషయం పూరి భార్యకి తెలియడంతో.. ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవద్దు.. బయటకు వెళ్లామనై చార్మికి స్ట్రాంగ్ వార్మింగ్ ఇచ్చిందట. అంతేకాకుండా ఇదే విషయంపై పూరితో కూడా గొడవ పడిందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -