Sunday, May 19, 2024
- Advertisement -

జక్కన్న వార్నింగ్ ఇచ్చింది ఎవరికో తెలుసా?

- Advertisement -

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి లాంటి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపదించుకున్నాడు. ఈ చిత్రాన్నికి ఈ రెంజ్ లో పాలోయింగ్ వచ్చింది అంటే దానికి ముఖ్యకారణం రాజమౌళి అని అందరికి తెలుసు. ప్రస్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2కి నెల రోజులు పాటు షూటింగ్ కు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు బాహుబలి టీం మొత్తం తిరిగి షూటింగ్లో పాల్గొన్నాడటానికి రెడి అవుతుంది. ఈ నెలలోనే ఈ చిత్రాన్నికి సంబంధించి కీలకమైన యుద్ధ సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ యుద్ద సన్నివేశాలు తెరకెక్కించడానికి జక్కన్న పక్కాప్లాన్ వేశాడట. ఈ నెలలో తెరకెక్కించే షెడ్యూల్ లో రాజమౌళి ప్ర‌భాస్‌-రానాల మ‌ధ్య కీల‌క‌మైన వార్ సీన్స్ కూడా షూట్ చేస్తాడు అని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళుతున్న యూనిట్ సభ్యులకు రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

ఇటివలే బాహుబలి యూనిట్ సభ్యులతో ఓ మీటింగ్ పెట్టి ఎవరు కూడా షూటింగ్ కి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాకుండా సినిమాకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా ఉండాలి అని చెప్పాడట. ఒక్క ఫోటో అయిన లీక్ అయితే ఊరుకునేది లేద‌ని అందరికి వార్నింగ్ ఇచ్చాడట. సో మొత్తాన్నికి జక్కన్న బాహుబలి ని సంబంధించి ఎలాంటివి బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -