పరవ్ స్టార్ , మెగా పవర్ స్టార్ ఒకే సినిమాలో గెస్ట్ లుగా నటిస్తే ఎలా ఉంటుంది..ఆ ..అది జరిగేపనేనా అంటున్నారా..అయితే అందుకు జరిగేందుకు అవకాసముందని తెలుస్తోంది. చిరంజీవి 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నేపధ్యంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కనిపించాలని నిర్ణయంచుకున్నట్లు సమచారం. ఈ మేరకు చిరంజీవి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇది తన 150 వ చిత్రం మాత్రమేనని, ఇదేమీ తన ఆఖరి చిత్రం కాదు కదా..ఎందుకు మీరంతా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అయితే రామ్ చరణ్ మాత్రం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. . ఇక.. చిరంజీవి 150వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారాయన. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’ చిత్రం రీమేక్లో చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తమిళ టైటిల్నే తెలుగుకి కూడా పెడతారనే టాక్ వినిపించింది.అయితే, ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ని ఫైనల్ చేసారని , చిరునే చెప్పి ఆనందపరిచారు. మరో ప్రక్క..ఈ 150వ చిత్రం… ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు…? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా ఈ చిత్ర మాతృక కథ మీద వివాదం చెలరేగడంతో కొంత కాలం హాట్ టాపిక్గా మారింది.
అయితే వీవీ వినాయక్ మాత్రం ఆ వివాదాలేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతున్నట్లు సమచారం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ను తీర్చిదిద్ది, చిరంజీవికి కూడా వినిపించారని సమాచారం. స్క్రిప్ట్ విన్న చిరంజీవి ఆనందపడిపోయి, వినాయక్ను హగ్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. ఈ చిత్రాన్ని హీరో రామ్చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా నయనతార పేరు వినపడుతోంది.