Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం ప్లాన్ మార్చిన కొరటాల !

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏడాది క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల పుకార్లు షికారు చేశాయి. కథలో కొరటాల చాలా మార్పులు చేశాడని, కాదు కాదు.. పూర్తిగా కథనే మార్చి మరో కొత్త కథ సిద్దం చేస్తున్నాడని.. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ రావడంతో తారక్ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు. అయితే మరెందుకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడం లేదు అనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆచార్య డిజాస్టర్ తరువాత కథల విషయంలో కొరటాల మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది..

” ఆర్ ఆర్ ఆర్ ” తరువాత ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరగడంతో కథను బౌండెడ్ గా తయారు చేసేందుకే కొరటాల ఆలస్యం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మొదట అనుకున్న కథను పక్కన పెట్టేసి మరో కథను సిద్దం చేశారట కొరటాల.. ఈ కథ పరిధి పెద్దది కావడంతో ఎన్టీఆర్ 30 మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజం అయితే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇప్పటివరకు రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి, పుష్ప వంటి మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి. దాంతో ఎన్టీఆర్ మూవీ కూడా రెండు భాగాలుగా వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్నో రోజులుగా అభిమానులను ఉరిస్తున్న NTR30 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

శర్వానంద్ పెళ్లి.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో సుక్కు మూవీ.. అప్పుడే ?

మరో ప్రయోగానికి సిద్దమైన రామ్ చరణ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -