కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పలు పాన్ ఇండియా మూవీస్ లో దూసుకుపోతూ సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. రష్మిక మందన నాగశౌర్య హీరోగా నటించిన “చలో” మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.
రష్మిక మందన సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన అభిమానులకు వినోదాన్ని పంచడంలో ముందుంటుంది. తాజాగా రష్మిక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. అందులో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎవరంటే ఇష్టం, ఒకవేళ మీరు డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళ్తారు అనే ప్రశ్నకు రష్మిక సమాధానమిస్తూ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు పిచ్చా అభిమానినని చెప్పుకొచ్చిన ఆమె అవకాశం వస్తే ఆయనతో ఒక్కరోజు డేట్కి వెళతానని తన మనసులోని మాటను వెల్లడించింది.
Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి
ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సుల్తాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రష్మిక అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Also read:వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?