Sunday, May 12, 2024
- Advertisement -

బుల్లితెరపైకి రేణు దేశాయ్.. ఏ షోలో తెలుసా..?

- Advertisement -

రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటికి.. ఆమె మనసు మాత్రం తెలుగు ప్రజల మీదే ఉంది. మహారాష్ట్రకు చెందిన రేణు దేశాయ్.. ఇప్పుడు ఒక రియాలిటీ షోతో తెలుగు ప్రజలను పలకరించబోతుంది. ఇప్పటికే రేణు ఈ విషయంను వెల్లడించింది.

టివీ షోలతో ఆమె తెలుగు వాళ్లకు మరింత దగ్గర కానుంది. స్టార్ మా నెట్ వర్క్ లో రేణు దేశాయ్.. ఒక షోకి జడ్జుగా వ్యవహరించబోతుందని.. కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు సంబంధించి అసలు విషయం బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది ఆ టీవీ ఛానల్ నెట్ వర్క్. రేణు కనిపించబోయే షో పేరు.. ‘నీతోనే డాన్స్’. ఈ షోకి ఆమె జడ్జిలలో ఒకరిగా కనిపించనున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జానీ మాస్టర్ కూడా ఒక జడ్జిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఈ డ్యాన్స్ మాస్టర్ కు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు.

టైటిల్ ను బట్టి చూస్తే.. ఇది డ్యాన్స్ షో అని తెలుస్తోంది. తెలుగులో డ్యాన్స్ షోలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ టెలివిజన్ తెరపై కొన్ని డ్యాన్స్ షోలు టాప్ టీఆర్పీలతో సాగాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్.. జడ్జిగా వ్యవహిరించబోతున్న షోగా దీనికి ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. అయితే రేణు షోలో జడ్జిగా చేస్తున్న విషయం పవన్ కళ్యాణ్ కి తెలుసో లేదో.. తెలియదు కానీ ఈ షో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -