అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరైనోడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఐతే తాజాగా ఈ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఎకంగా కోటిన్నర్ విలువ చేసే సెట్ వేశారట. ఈ స్పెషల్ సాంగ్లో అల్లు అర్జున్, కేథరిన్ నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి ఈ సెట్ వేశారట. మరో మూడు రోజుల్లో ఈ సాంగ్ కాంప్లీట్ అవునుందట. బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో ఈ సాంగ్ షుట్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని చెపుతున్నారు.
అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్తో కూడిన ప్రేమకథగా ఈ సినిమా తెరకేక్కుతుంది. రకుల్ ప్రీతి సింగ్ మెయిన్ హీరోయిన్గా నటిసున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాట కూడా పాడటం విశేషం.