బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ చాలా మారిపోయింది. అంతకముందు ప్రభాస్ కేవలం 40 కోట్ల హీరో మాత్రమే బాహుబలి తరువాత సీన్ రీవర్స్ అయింది.ఇప్పుడు ప్రభాస్ తెలుగులో కాదు ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా నిలిచాడు.అందుకొసమే ప్రభాస్ తన తరువాత సినిమాపై చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు.ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రద్ధా కపూర్ కథా నాయిక.ఈ సినిమా హాలీవడ్ సినిమాలా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.ప్రస్తుతం చిత్రబృందం దుబాయ్ వెళ్లింది. దుబాయ్లోని ప్రముఖ లొకేషన్లలో ప్రభాస్, మరికొంత మంది ఫైటర్ల మధ్య యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. సినిమాలో దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ యాక్షన్ సన్నివేశం కనిపించబోతోందని సమాచారం. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ నేతృత్వం వహిస్తారు.