Wednesday, April 24, 2024
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో సాయిపల్లవి ప్రత్యేకతే వేరు. మనసుకు నచ్చిన సినిమాలు.. హోమ్లీ పాత్రలు మాత్రమే ఒప్పుకుంటు, గ్లామర్ వంకతో అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది. సినిమా కథ నచ్చకపోతే చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు సాయిపల్లవిని అడిగారట. పాత్ర నచ్చకపోవడంతో ఆమె వెంటనే నో చెప్పేసిందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రచారం సాగుతుంది.

ప్రస్తుతం సాయిపల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగును పూర్తిచేసింది. ‘విరాటపర్వం’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలలో నటిస్తోంది. మరికొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -