Friday, May 3, 2024
- Advertisement -

సంపత్ నంది చాలా మంది శత్రువులను తయారు చేసుకున్నాడు!

- Advertisement -

బెంగాల్ టైగర్ సినిమాతో టాలీవుడ్ లో తను నిల దొక్కుకోవడం ఏమో కానీ.. ఆ సినిమాలో డైలాగులతో కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఆ సినిమా దర్శకుడు కమ్ రచయిత  సంపత్ నంది. రవితేజతో రూపొందించిన ఈ సినిమాలో ఎంతగా వీలైతే అంతగా పవన్ కల్యాణ్ భజన చేశారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత పవన్ కల్యాణే.. అనే మాటను పలికించడంతో పాటు..పవన్ కల్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న భావాన్ని కూడా పలికించారు. మరి ఈ డైలాగులతో పవన్ అభిమానులు ఆనంద పడటం మాటేమిలో కానీ.. ఈ డైలాగులు మాత్రం సంపత్ నందికి ఇండస్ట్రీ లో శత్రువుల సంఖ్య ను అమాంతం పెంచేశాయి. ఏం రజనీకాంత్ తర్వాత పవన్ కల్యాణేనా.. ఇంకెవరూ లేరా? అనే ప్రశ్నలను సంధిస్తున్నారు టాలీవుడ్ లోని మిగతా హీరోల అభిమానులు. చిరంజీవి.. ఎక్కడకు పోవాలి?

 రజనీకాంత్ తర్వాత దక్షిణాదిలో ఆయనదే కదా స్థానం అనేవాళ్లు కొందరైతే.. పవన్ కన్నా మహేశ్ బాబునే పెద్ద స్టార్ అనేవాళ్లు మరికొందరు. ఇక రజనీ తర్వాత పవనే అంటే.. నందమూరి కుటుంబం కూడా హర్ట్ అవుతుంది! ఇలా ఏ విధంగా చూసినా… పవన్ కల్యాణ్ భజన సంపత్ కు శ్రతువులను పెంచుతోంది. 

ఇక పవన్ వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే.. ఆ పార్టీ అభిమానులు కారాలూ మిరియాలు నూరుతున్నారు. తమ అధినేత ను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు తప్ప.. పవన్ వల్ల కాదు అనేది వారి వాదన. దీంతో తెలుగుదేశం వాళ్లతో కూడా సంపత్ నంది గోక్కొన్నట్టైంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -