ఢీ షోలో ఎన్నో రోజులుగా జడ్జీగా శేఖర్ మాస్టరే చేస్తున్నారని మనకు తెలిసిందే. ఈ షోతో ఆయనకు ఎంతో మంచి పేరు కూడా వచ్చిందని చెప్పాలి. ఆ షోలో జడ్జీగా చేయడంతోనే పలు షో లలో జడ్జీగా చేసే అవకాశాలు వస్తున్నాయని ఆయన కూడా నమ్ముతున్నారని తెలుస్తోంది. అందుకే సినిమాలతో ఎంత బీజీగా ఉన్నా.. ఢీ షోను మాత్రం ఆయన వదలడం లేదు.
ఈ షోలో తన తోటి జడ్జులతోనే కాకుండా ఫీమేల్ యాంకర్స్ తో కూడా శేఖర్ మాస్టర్ స్టెప్పులేస్తాడు. ఇది ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇప్పడు నడుస్తున్న ఢీ 13వ సీజన్ లో కూడా తన స్టెప్పులతో శేఖర్ మాస్టర్ అదరకొడుతున్నాడని చెప్పాలి. అయితే ఈ సీజన్ కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్ రెచ్చిపోయాడు.
ఇప్పటికే రష్మీతో ఎన్నో రొమాంటిక్ సాంగ్ ల్లో స్టెప్పులేసిన మాస్టర్. కొత్తగా వచ్చిన యాంకర్ దీపికను కూడా వదలలేదు. ఆమెతో కూడా డ్యాన్స్ మూమెంట్ వేశాడు. ఎంతో రొమాంటిక్ గా ఇద్దరు ముద్దు గుమ్మలతో డ్యాన్స్ చేశాడు. ఈ ఢీ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోందంటే ఈ మాస్టర్ కూడా ఒక కారణమని ఎంతో మంది అంటుంటారు.