Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంతల పెళ్లిపై శ్రీయా భూపాల్ ఏమన్నాదో తెలుసా ?

- Advertisement -

సినీ తారలకు, రాజకీయ నాయకుల పిల్లలకు ఉన్న క్రేజ్.. వ్యాపారవేత్తలకు ఉండదు. కొన్ని వందల కోట్లకు వారసురాలైన శ్రియా భూపాల్.. అందరికి పరిచయం అయింది మాత్రం అక్కినేని ఫ్యామిలీ వల్లే. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో నిశ్చితార్ధం తర్వాత శ్రియాభూపాల్ బాగా హైలెట్ అయింది. రోమ్ లో వారి పెళ్లి జరపాలని ప్లాన్ చేసినప్పటికి.. అది క్యాన్సిల్ అయింది.

అయినా సినిమా తారల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. పెళ్లి అయిన వెంటనే బ్రేకప్ చెప్పుకున్నవారుంటారు.. కొన్నేండ్లు కలిసి బతికాక కూడా విడిపోయిన వారుంటారు. ఇది పెద్ద విషయం కాదు వారికి… అఖిల్ తో ప్రేమ, పెళ్లి వరకూ వచ్చి బ్రేకప్ అయినప్పటినుండి శ్రీయా ప్రతి కదలికపై మీడియా ఫోకస్ పెరిగింది. అప్పట్లో యువహీరోతో వీకెండ్ పార్టీ అంటూ కూడా వార్తలొచ్చాయి. శ్రీయా భూపాల్ తో ఉన్న ఒక ఫోటోను అల్లు శిరీష్ పోస్టు చేశారు. తర్వాత వారిరువురూ ఫ్యామిలి ఫ్రెండ్స్ అని ప్రకటించడంతో ఆ ఇష్యూని అప్పటితో వదిలేశారు. అఖిల్ తో రిలేషన్ మళ్లీ బలపర్చేందుకు మెగా ఫ్యామిలి కోడలు ఉపాసన కూడా శ్రీయాను ఒప్పించే బాద్యత తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అవన్నీ బెడిసికొట్టాయి. తాజాగా చైతన్య, సమంతా లపెళ్లి ఫోటోను ఎఫ్బీ లో పోస్టు చేసి విష్ చేసింది శ్రీయ భూపాల్. పెళ్లికి అటెండ్ అయింది లేనిదీ ఇంకా సస్పెన్సే.

వాస్తవానికి సమంతా, చైతూ ల పెళ్లికి ముందే అఖిల్, శ్రీయాల పెళ్లి ఫిక్స్ చేశారు.. ఒకవేళ వారి పెళ్లయి ఉంటే సామ్, చై ల పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ జంటే ఉండేదేమో?!! ఇప్పుడు శ్రీయ జస్ట్ విష్ చేసిందా? లేకపోతే అక్కినేని ఫ్యామిలితో తాన రిలేషన్ కోరుకుంటున్నా.. అని ఈ పోస్టు ద్వారా సంకేతం పంపించిందా?…ఎందుకంటే అఖిల్ తో బ్రేకప్ అయ్యాక ఫస్ట్ టైం శ్రీయా రెస్పాన్స్ ఇదే. మరి శ్రీయా మళ్లీ అఖిల్ తో కలుస్తుందా.. లేదా.. చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -