Monday, April 29, 2024
- Advertisement -

జగన్ ను పొగొడుతూ.. పవన్ ను ఏసుకున్న శ్రీరెడ్డి..!

- Advertisement -

శ్రీరెడ్డీ రోజుకో వార్తతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ లైవ్ చాట్ లో పాల్గొని ఏపీలోని ప్రధాన రాజకీయ నాయకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నాకెందుకు భయం.. నన్నెవరూ ఏం చేయలేరు అనే విధంగా శ్రీరెడ్డి కామెంట్స్ ఉంటాయి.

క్యాస్టింగ్ కౌచ్ విషయంపై టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులపై లెక్కలేనన్ని ఆరోపణలు గుప్ప్ంచిన ఈమె.. ఇటివలే కాలంలో రాజకీయ పరిస్థితులపై, రాజకీయ నాయకులపై కూడా విరుచుకు పడుతుండటం చూస్తున్నాం. తాజాగా ఓ లైవ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ, ఆయన్ని విమర్శిస్తున్న వారిని తిడుతూ రచ్చ రచ్చ చేసింది.

జగన్ ఓ మంచి మనిషి అని, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారని చెప్పింది. ఇంతమంచి పాలన చేస్తున్నా జగన్‌పై చాలామంది ఆరోపణలు చేస్తున్నారని, అసలు వాళ్లకు సిగ్గులేదా? అనేసింది శ్రీరెడ్డి. ఈ కామెంట్స్ బట్టి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా తెలుస్తోంది. అనకూడని.. చెప్పకూడని పదజాలం ఉపయోగిస్తూ సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి.

ఈ కామెంట్స్ విన్న తర్వాత కొందరు శ్రీరెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇక ఇన్నాళ్లు సినిమాలు లేని శ్రీరెడ్డి ఇటివలే క్లైమాక్స్ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. షుటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.facebook.com/iamsrireddy/videos/2499520720303411/?t=10

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -