Tuesday, May 14, 2024
- Advertisement -

చెర్రీ, తార‌క్‌తో జ‌క్క‌న్న సినిమా

- Advertisement -
  • మ‌ల్టీస్టార‌ర్‌కు రాజ‌మౌళి ప్లాన్‌..?

బాహుబ‌లి ప్రాజెక్టుతో ఐదారేళ్లు బిజీగా ఉన్న రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా ప్ర‌క‌టించ‌లేదు. బాహుబ‌లి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన ప్ర‌పంచ న‌లుమూల‌లా నుంచి ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న త‌ర్వాత చిత్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అత‌డి సినిమా కోసం ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌లే కాక త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళంతో పాటు ప్ర‌పంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే నిన్నట్వీట్ చేసిన ఓ ఫొటో వైర‌లైంది. యువ న‌టులు రాంచ‌ర‌ణ్‌తేజ్‌, నంద‌మూరి తార‌క రామారావుతో క‌లిసి రాజ‌మౌళి దిగిన ఫొటో ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది. అయితే దానిపై ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. దేని గురించో రాయ‌లేదు. ఆ త‌ర్వాత ఈ ఫొటోపై అంద‌రూ స్పందించారు. సైలెంట్‌గా ఉన్న ట్విట్ట‌ర్‌కు రీట్వీట్, లైకుల వ‌రద వ‌చ్చేసింది. ఇద్ద‌రు యువ న‌టుల‌తో క‌లిసి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రాజ‌మౌళి తీయ‌న‌బోతున్నాడ‌ని అంద‌రి మాట‌గా వినిపించింది.

అయితే రాజ‌మౌళి ఇంత‌కుముందే ఆ ఇద్ద‌రితో సినిమాలు తీసి అద్భుత విజ‌యాల‌ను అందుకున్నాడు. జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌తో మూడు సినిమాలు తీశాడు. స్టూడెంట్ నం-1, సింహాద్రి, య‌మ‌దొంగ‌. రాంచ‌ర‌ణ్ త‌న రెండో సినిమా మ‌గ‌ధీర జ‌క్క‌న్న‌నే తీశాడు. ఈ సినిమా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టింది. అప్ప‌టి నుంచి తెలుగు సినిమా ప‌రిధి పెరిగింది. రాజ‌మౌళి వారిద్ద‌రితో సినిమాలు తీసి వాళ్ల కెరీర్‌లో మ‌ర‌పురాని విజ‌యాలు అందించాడు. ఈ విధంగా తీసిన రాజ‌మౌళి ఇప్పుడు వారిద్ద‌రితో సినిమా తీసి బ‌హూబ‌లి సినిమాల క‌న్నా అద్భుత సినిమా తీస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఆ ముచ్చ‌ట‌కు ఇప్పుడు విడుద‌లైన ఫొటో బ‌లం చేకూరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -