టాలీవుడ్లో కింగ్ అక్కినేని నాగార్జునకు ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అమ్మాయిల కలల రాకుమారుడిగా, మన్మథుడిగా నాగార్జున పిలిస్తుంటారు. నాగార్జున ముందుగా దగ్గుపాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. వీరి కుమారుడే అక్కినేని నాగచైతన్య. తర్వాత నాగ్ తనతో కలిసి నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరి కుమారుడు అఖిల్.
ఇదిలా ఉంటే నాగ్కు బాలీవుడ్ హీరోయిన్ టబూకు మధ్య ఉన్న సంబంధం గురించి అప్పట్లో రకరకాలుగా వార్తలు హల్ చల్ చేశాయి. టబూ, నాగ్ అంటే ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టమట. నాగ్, టబూ ప్రేమించుకున్నారని.. టబూ హైదరాబద్ వస్తే.. నాగ్ ను కలిసి వెళ్లేదనే టాక్ కూడా వచ్చింది. నాగ్, టబూ కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా అనే సినిమా టైంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత కూడా వీరిద్దరు కలిసి కొన్ని సినిమాలో నటించారు. ఆ సినిమాల వల్ల వీరి మధ్య బంధం గట్టిగా మారిందట.
నాగ్ మీద ఉన్న ప్రేమతోనే టబూ 40 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం టబూ హైదరబాద్ లోనే ఎక్కువగా కాలం గడుపుతోంది. ఇక తాజాగా ఒక సంఘటన నాగ్ కు తన మాజీ ప్రేయసి మీద ఉన్న ప్రేమ తగ్గలేదని చెబుతోంది. తన కుమారుడు అఖిల్ రెండో సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం టబూని ఎంపిక చేసినట్లు సమాచారం. విక్రమ్ కూమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబూ ను నటింపించేసేందుకు నాగ్ స్వయంగా ఫోన్ చేసి అడిగాడట. నాగ్ ఫోన్ చేసి అడగటంతో వెంటనే సరే అనేసిందట టబూ. అది వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం.
Related