డ్రగ్స్ రాకెట్లో పూరి జగన్నథ్ కి దగ్గర వారే ఎక్కువ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే కెల్విన్తో సంబంధం అనే ప్రశ్నలను వారి అడుగుతున్నారు సిట్ అధికారులు. అలాగే పూరీ జగన్నాథ్తో మీకున్న సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో కెల్విన్ తర్వాత పూరీ జగన్నాథే టార్గెట్గా విచారణ సాగుతోందని అర్థమవుతోంది.
ఇది ఇలా ఉంటే ఈ కేసు విషయంలో పూరికి ఉన్న సంబంధాలను మరింతగా బయటపెట్టింది సుబ్బరాజేనని తెలుస్తోంది. అధికారులు సుబ్బరాజు సాక్ష్యాలను చూపిస్తూ బయటపెట్టెశాడట. దాంతో ఈ విషయాలను సుబ్బరాజు బయటపెట్టినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పూరీ జగన్నాథ్కి చెందిన లింకులను సిట్ ముందు లీక్ చేయడం వల్ల తాను ఆయనకు ద్రోహం చేశానని సుబ్బరాజు కుమిలిపోతున్నాడట. విచారణకు హాజరైన మరునాడు పూరీ జగన్నాథ్కు ఫోన్ చేసిన సుబ్బరాజు పూరీతో మాట్లాడాడట.
“అన్నయ్యా ఈ స్థాయిలో నేనుండటానికి కారణం మీరే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మీ గురించి సిట్ అధికారులకు కొన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది. కావాలని చెప్పలేదు.. పరిస్థితులు నాతో అలా చేయించాయి. నన్ను క్షమించండి. అంటూ ఏడ్చినంత పనిచేశాడట సుబ్బరాజు. అయితే సుబ్బరాజును పూరి జగన్నథ్ ఏమీ అనలేదని అతడి సన్నిహితులు అంటున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు బాలేవని.. అన్నీ సర్దుకుంటాయని సుబ్బరాజును ఓదార్చాడట పూరి.