జబర్ధస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ ఎంత ఫాపులర్ అయిందో.. అదే రేంజ్ లో సుధీర్ కూడా ఫాపులర్ అయ్యాడు. వీరిద్దరికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక మా ఇద్దరి మధ్య కేవలం వృత్తి పరమైన స్నేహమే తప్పిస్తే మరేం లేదని చాలా సార్లు చెప్పాడు.
అయినా కూడా రష్మీ-సుధీర్ పై గాసిప్పులు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే వారిద్దరు కలిసి చేసే షోలలో చేసే ఓవర్ యాక్షన్ అటువంటింది. అయితే తాజాగా మరోసారి సుధీర్ వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ మట్లాడుతూ రష్మీకి తనకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని.. మణికొండలో కాపురం కూడా చేస్తున్నామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇది నిజం కాదులేండి.. న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో రష్మీకి మీకు పెళ్లై పోయిందటగా అని సుధీర్ని ప్రశ్నించగా.. మీరింకా పెళ్లి వరకే వెళ్ళారు..
మేమిద్దరం మణికొండలో ఒక ప్లాట్ తీసుకుని కాపురం కూడా చేస్తున్నామని రాశారని చెప్పాడు. ఎవరెన్ని రూమర్లు క్రియేట్ చేసినా నాకు ఏం బాధలేదని.. అన్నాడు. సినిమాలు లేకపోతె రిక్షా తొక్కుకునైనా నా కుటుంబాన్ని పోసించుకుంటానని చెప్పాడు సుధీర్. దీంతో ఇప్పుడు సుధీర్ చేసిన వ్యాఖ్యలు బుల్లితెర, వెండితెర వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.