- Advertisement -
రామ్చరణ్, తమన్నా కలిసి రచ్చ సినిమా చేశారు. ఈ సినిమా హిట్ కుడా అయింది.తరువాత వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటించలేదు.ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు రాంచరణ్,తమన్నా కలిసి నటిస్తున్నారు.అయితే తమన్నా హీరోయిన్గా కాదు ఐటెం గాళ్గా యాక్ట్ చేస్తుంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది.
అందులో ఓ ఐటెం సాంగ్ని ప్లాన్ చేశాడు బోయపాటి.ఆ పాటకి తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని అందుకే తమన్నాను తీసుకున్నారని సమాచారం. ‘రచ్చ’ సినిమాలో ‘వానా వానా వెల్లువాయే పాటకు వీరిద్దరు డ్యాన్స్ చూసిన వారందరికి మళ్లీ ఆ సీన్ రీపిట్ అవుతుందని ఆశిస్తున్నారు.