అందాల భామ ప్రియమణికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది. రేపో మాపో ఆమె ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కూడా జరగనుంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్తో లవ్ లో ఉంది.. కొద్ది కాలం ప్రేమాయణం సాగించాక అతడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది.
ఈ టైంలో పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి లీక్ అయ్యింది. తరుణ్ – ప్రియమణి పెళ్లి ఫిక్సయ్యిందట. ఇది నిజమే..అయితే ఇది ఇప్పటి మాట కాదు… ప్రియమణి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కంటిన్యూ అవుతున్న టైంలో కొందరు ఆమెకు ఫోన్ చేసి మీకు తరుణ్తో పెళ్లి ఫిక్సయ్యిందట కదా ? నిజమేనా ? అని అడిగారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో స్వయంగా బయటపెట్టింది ప్రియమణి.
అలీతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న ప్రియమణిని మీపై వచ్చిన ఓ భయంకరమైన రూమర్ గురించి చెప్పండని అడిగితే తరుణ్తో తన పెళ్లి ఫిక్సయిన విషయాన్ని బయట పెట్టింది. ఆ ఫోన్ చేసిన వారు తరుణ్ మీకు లగ్జరీ కారు కూడా గొప్ట్ గా ఇచ్చారట కదా అని ఆడిగారట. . వెంటనే ప్రియమణికి చిర్రెత్తు కొచ్చిందట. ఇలాంటి రూమర్స్ తనపై ఎందుకు పుట్టిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యిందట. అప్పటకి తనకు ఇన్నోవా కారు మాత్రమే ఉండేదట. ఈ విషయం తరుణ్తో చెపుతూ కారు ఇస్తా ఇస్తా ఇలాంటి కారు ఇచ్చావేంటి? అందరూ అనుకుంటున్నట్టుగానే లగ్జరీ కారు ఇవ్వొచ్చు కదా అని తరుణ్తో అంటే తరుణ్ పగలబడి నవ్వేవాడట. అది తరుణ్ – ప్రియమణి పెళ్లి సంగతి.
Related