దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. ఈ నెపథ్యంలోనే ఈ ఎఫెక్ట్ సినిమా రంగంతో పాటు సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోలపై కూడా తీవ్రంగా పడనుందని వార్తలు వస్తున్నాయి. అయితే మోడీ నిర్ణయం టాలీవుడ్ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తుందని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ రూ.25-30 కోట్లు… మహేష్ బాబు25 కోట్లు… ఎన్టీయార్.. 18 కోట్లు, అల్లు అర్జున్.. 15 కోట్లు తీసుకుంటున్నారు. ఈ రెమ్యునరేషన్లు నిజమైనా.. కాకపోయినా.. ఇవీ మన టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు అంటూ ప్రచారం సాగుతూ ఉంటుంది. హీరోల పారితోషికాలు ఈ రెంజ్ లో ఉన్నా ఇందులో మొత్తం వైట్ మనీ ఉండదు. సగం బ్లాక్మనీ, సగం వైట్ మనీ. ‘ఓ హీరో తన రెమ్యునరేషన్లో 80 శాతాన్ని బ్లాక్మనీగా ఇమ్మన్నాడ’ని ఓ నిర్మాత చెబుతున్నాడంటే తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్మనీ ఎంతగా రాజ్యమేలుతోందో తెలుసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పరిస్థితికి చెక్ పెట్టారు నరేంద్రమోడీ. ఇకపై హీరోలకు నిర్మాతలు చెల్లించే మనీ మొత్తం కేవలం బ్యాంక్ అక్కౌంట్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇకపై హీరోలకు, ఇతర చిత్ర యూనిట్ అంతటికీ బ్యాంక్ల ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు. నిర్మాతల వద్ద అంత డబ్బు వైట్మనీ రూపంలో ఉండదు. కాబట్టి హీరోలకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారు ముందుకు రాలేరు. ఈ క్రమంలో స్టార్ హీరోలు కూడా తమ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటారు. అయితే ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమే.. ఆ తర్వాత షరా మామూలే అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
Related