- Advertisement -
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫాంటసీ మూవీతో వస్తున్న సంగతి తెలిసిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ సినిమా విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు మెగాస్టార్.
ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుండగా ఇందుకోసం 13 మ్యాసివ్ సెట్లను నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమాలో చిరు సరసన త్రిషను హీరోయిన్గా ఎంపిక చేశారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ జోడిగా వస్తుండటం విశేషం. చివరగా 2006లో స్టాలిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వీరిద్దరూ.
యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా విజువల్ వండర్ గా ఉండబోతుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది.