మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ తో ‘అ…ఆ’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షుటింగ్ వేగంగా జరుగుతుంది. మార్చ్లో ఆడియో రిలీజ్ చేసి సమ్మర్ కానుకగా మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక అ..ఆ సినిమా తర్వాత తివిక్రమ్ తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ ద్విబాష చిత్రం చేయ్యనున్నాడట.
ఐతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పట్టనుందట. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఐతే ఈ చిత్రంలో బన్నీ ని ఒక హీరోగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరో హీరో గా అక్కినేని నాగార్జునను తీసుకుంటే బాగుంటుందని చూస్తున్నారట.
నాగార్జున ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ సినిమా సేట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ‘అ…ఆ’ సినిమా విషయాన్నికి వస్తే నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు