తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్ ఇటీవలే ఘనంగా ముగిసింది.బిగ్బాస్ విన్నర్గా కౌశల్గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్బాస్ రెండో సీజన్ ఫైనల్స్లో ఐదుగురి సభ్యులతో పోటీపడి మరి విజయం సాధించాడు కౌశల్.కౌశల్తో పాటు గీతా మాధురి,తనీష్,సామ్రాట్,దీప్తిలు ఫైనల్కు వెళ్లారు.అయితే బిగ్బాస్ ఫైనల్ విషయంలో దీప్తికి అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు.బిగ్బాస్ ఫైనల్స్లో దీప్తి నాల్గోవ స్థానంలో నిలిచింది.అయితే దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు దీప్తి ఫ్యాన్స్.
కౌశల్ కంటే దీప్తికి కాస్త తక్కువ ఓట్లు వచ్చి రెండవ స్థానంలో నిలిచిందని – కాని షో నిర్వాహకులు మాత్రం విమర్శలకు భయపడి రన్నరప్ గా గీతా మాధురిని ప్రకటించారు అంటూ దీప్తి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. దీప్తికి ఫేక్ ఓట్లు ఎక్కువగా పడ్డాయి అనే ఉద్దేశ్యంతోనే బిగ్బాస్ నిర్వాహకులు ఇలా చేసినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీప్తి అభిమానులు మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన దీప్తిని రన్నరప్ గా ప్రకటించకుండా నిర్వాహకులు ఆమెకు అన్యాయం చేశారు అంటూ బిగ్బాస్పై మండిపడుతున్నారు.