Saturday, April 20, 2024
- Advertisement -

వెన‌క్కి త‌గ్గిన వ‌రుణ్ తేజ్‌..గ‌నికి అస‌లు ఏం జ‌రిగింది?

- Advertisement -

వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గ‌ని.. ఈ సినిమా జూలై 30న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ల విష‌యంలో నిర్మాత‌లు మ‌రోసారి ఆలోచిస్తున్నార‌ట‌. అస‌లు ఎందుకు ఏంటి అనే ప్ర‌శ్నలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కార‌ణాలు ఇవే అంటు ప‌లువురు పోస్ట్ లు పెడుతున్నారు.

అయితే ఎఫ్‌2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ లాంటి వ‌రుస హిట్ల‌తో ఫామ్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ కొత్త సినిమాపై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి.ఈ ఏడాది ఎఫ్ 3తో పాటు గ‌ని సినిమాను కూడా విడుద‌ల చేస్తాన‌ని వ‌రుణ్ అనుకున్నాడ‌ట‌. అందులో భాగంగానే జూలై 30న గ‌ని సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మూవీ యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ ఇప్పుడు ఆ తేదికి ప్రేక్ష‌కుల ముందుకు రావాలా? వద్దా? అనే ఆలోచిస్తున్నార‌ట‌.

దానికి కార‌ణం లేక‌పోలేదు. అదేంటంటే సినిమాల్లో ఏర్ప‌డ్డ పోటీనే.. జూలై 16 నుంచి ఆగ‌స్ట్ 13 వ‌ర‌కు కొంత కొంత గ్యాప్ తోనే 3 పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ హీరోగా చేసిన రాధేశ్యామ్ కూడా విడుద‌ల‌వుతోంది. దాంతో ఆ పోటీలో సినిమాను విడుద‌ల చేస్తే.. విజ‌యం సాధిస్తుందా అనే ప్ర‌శ్న నిర్మాత‌ల‌ను వెంటాడుతుంద‌ట‌. మ‌రి ఏం చేస్తారో వేచి చూడాలి.

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -