ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు భారీ బడ్జెట్ల, పాన్ ఇండియా సినిమాల పేరుతో చేయడం సినీ పరిశ్రమలో సర్వసాధారణ గా మారి పోతున్న విషయం తెలిసిందే. మరో పక్క నిర్మాతలు లేదా చిత్ర యూనిట్ ఈ ప్రచార వ్యూహాన్ని వాడుతుంటారు. ఆ విషయానికొస్తే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సినిమాల బడ్జెట్పై ప్రచారం జోరుగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా భారీ బడ్జెట్ సినిమాలే. సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ సినిమాలు స్వయంగా మేకర్స్ అధికారికంగా 400 కోట్ల, 500 కోట్ల బడ్జెట్ సినిమాలుగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఒకోక్క సారి భారీ బడ్జెట్ మరియు హైప్ క్రీయేట్ చేసిన ప్రచారాం తప్పు కావచ్చు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కంటెంట్ విషయాంలో నిరాశ చెందుతుంటారు. ఆప్పుడు అంచనాలు తారుమరవ్వుతుంటాయి.
సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రచారం చేయబడినవే. ఈ సినిమాల పై నిర్మాతలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు, అయితే ఈ సినిమాలు కంటెంట్ మరియు నాణ్యత విషయంలో ప్రేక్షకుల అంచనాలను సరిపోల్చడంలో విఫలమయ్యాయని చెప్పవచ్చు.
భారీ బడ్జెట్లు అని పిలవబడే ఈ సినిమాలు తెరపై గొప్పగా కనిపించడం లేదని ప్రేక్షకులు భావింస్తున్నారు మరియు సన్నివేశాలు VFXతో రూపొందించబడ్డాయి. ఈ సినిమాలు ఎక్కడికి పోయాయో అని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ తదుపరి సినిమాలు కూడా ఇదే ట్రెండ్ను కొనసాగిస్తే, భారీ బడ్జెట్ నంబర్ల గురించి నిర్మాతల మాటలను ప్రేక్షకులు ఎప్పటికీ నమ్మరు.