Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఞాతవాసి ప్ర‌త్యేక అతిథి థియేట‌ర్ల‌లోనే ద‌ర్శ‌నం

- Advertisement -

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాటమ రాయుడు ప‌రాజ‌యాల‌తో బాధ‌ప‌డుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు త‌నకు విజ‌యాల‌ను అందించిన స్నేహితుడు త్రివిక్ర‌మ్‌తో జ‌త క‌ట్టాడు. త్రివిక్ర‌మ్‌తో క‌లిసి అజ్ఞాత‌వాసిగా రానున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని సంక్రాంతి పండుగ‌కు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ప్ర‌త్యేక అతిథిగా సీనియ‌ర్ హీరో క‌నిపించ‌నున్నాడ‌ట‌.అయితే ట్రైల‌ర్‌లో మాత్ర‌మే ఆయ‌న కనిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలోని అన్నీ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసినా ఆ ప్ర‌త్యేక అతిథిని ఇంకా ప‌రిచ‌యం లేదు. ఆయ‌నెవ‌రో కాదు ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌. గోపాల గోపాల సినిమాల‌తో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రూ మ‌ళ్లీ అజ్ఞాత‌వాసిలో క‌నిపిస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ ప్ర‌త్యేక‌ అతిథి పాత్ర చేశారంట‌. కొన్ని నిమిషాల పాటు కనిపించి మాయమయ్యే అతిథి పాత్ర కాదని, ఈ చిత్రం కోసం వెంకీ పది రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తోంది. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, సినిమాకి మెయిన్‌ ఎట్రాక్షన్‌గా ఉంటుందని సమాచారం. ఈ క్యారెక్టర్‌ని సరాసరి తెర మీదే రివీల్‌ చేయాలా లేక ట్రెలర్‌లో చిన్నటీజ్‌ ఇవ్వాలా అనే దానిపై త్రివిక్రమ్‌ ఆలోచిస్తున్నాడట.

ట్రెలర్‌లో వెంకీ పాత్రని అలా మెరుపులా చూపిస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట‌. అయితే దానిని పూర్తిగా హిడెన్‌ మోడ్‌లో ఉంచితే ఫస్ట్‌ డే ఇంపాక్ట్‌ బాగుంటుందని మరో డిస్కషన్‌ కూడా జరుగుతోందని తెలిసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -