Sunday, May 12, 2024
- Advertisement -

అల్లు అర్జున్ , మహేష్ లతో విక్రమ్ కుమార్

- Advertisement -

దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం సినిమాతో తెలుగులో మంచి దర్శకుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు సైన్స్ పిక్షన్ స్టోరీతో 24 అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

ఈ 24 అనే సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఐతే ఈ 24 అనే సినిమా అయిపోగానే విక్రమ్ చేయబోయే సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. 

ఓ ప్రముఖ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో దర్శకుడు విక్రమ్ మాట్లాడుతూ  24  సినిమా తర్వాత తానూ చేయబోయే రెండు సినిమాలు తెలుగు హీరోలతోనే ఉంటాయి. అయితే ఆ రెండు సినిమాలో ఒక్కటి అల్లు అర్జున్ మరొకటి మహేష్ బాబు తో చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరనోడు సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. 

సరైనోడు అయిపోగానే విక్రమ్ అల్లు అర్జున్ తో చేసే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవంతో బిజీగా ఉన్నాడు. ఈ బ్రహ్మోత్సవం అయిపోగానే మురగదాస్ సినిమా లో నటిస్తారు. ఈ రెండు సినిమాలు అయిపోగానే మహేష్ విక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -