వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. 2023 జూన్లో వివాహం తర్వాత పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. దీంతో టాలీవుడ్ సైతం శర్వాని మర్చిపోయే స్ధాయికి చేరుకోగా ఇప్పుడు నెటిజన్లు శర్వా ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది.
అయితే పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిన శర్వా అక్కడ భార్య రక్షితతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ని ఎంజాయ్ చేస్తుండగా త్వరలో ఓ గుడ్ న్యూస్ని అందించబోతున్నారు. అంటే తన భార్య రక్షిత డెలివరీ అయ్యే వరకు సినిమాలకు దూరంగానే ఉండనున్నారు. అందుకే తన సినిమా ప్రాజెక్టులను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు పోస్ట్పోన్ చేశాడు.
ఇక చివరగా ఒకే ఒక జీవితం, మహా సముద్రం వంటి సినిమాలు చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్టు 35వ ప్రాజెక్టుని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేయనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ హీరోలందరికి, ముఖ్యంగా రామ్ చరణ్కు మంచి మిత్రుడు శర్వా. రీసెంట్గా జరిగిన వరుణ్ తేజ్ వివాహానికి హాజరు కావాల్సి ఉన్నా…ఫ్యామిలీ ట్రిప్లో ఉండటం వల్ల పాల్గొనలేకపోయారు.