Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో గెలిచేది ఎవరో తెలుసా..?

- Advertisement -

ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై వస్తున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో కంప్లీట్ దిశగా వేల్తోంది. 14 మంది కంటిస్టెంట్స్ మొదలైన ఈ షోలో ఇప్పుడు 6 గురు మాత్రమే మిలిగారు. వీరిలో ఇద్దరు నవదీప్, దీక్ష వైల్డ్ కార్డ్ ద్వార ఎంట్రీ ఇచ్చి, బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి ఉంటున్న వారికి వీరిద్దరూ గట్టి పోటి ఇస్తున్నారు.

వీరిలో దీక్షతో పోలిస్తే.. నవదీప్ టైటిల్ కోసం ముందంజలో ఉన్నట్లు కనబడుతోంది. అలానే హరితేజ కూడా ఓటింగ్ విషయంలో దూసుకెళ్తోంది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన దీక్ష ఎక్కువ కాలం ఉండదు అనుకున్నప్పటికి.. ఫైనల్ పోరు వరకు బానే నెట్టుకొచ్చింది. నవదీప్ మాత్రం ఎలాంటి భయం లేకుండా దూసుకెళ్తున్నాడు. నవదీప్ ఆలోచించి చేస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ రెంజ్ లో ఆలోచించే నవదీప్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడేమో చూడాలి. నవదీప్ కి గట్టి పోటి ఇస్తోంది హరితేజ. శివ బాలాజీ ఉన్నప్పటికి.. నవదీప్ పై జనాలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నవదీప్ ఏదైనా పాజిటివ్ గా ఆలోచిస్తాడు అయితే ఈ షో లో అందరి కన్నా అన్ని విషయాల్లో నవదీప్ ముందున్నాడని అనుకుంటున్నారు.

కానీ ఈ విషయంపై కత్తి మహేష్ ఆలోచన మరోలా ఉంది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన నవదీప్ కి టైటిల్ విన్నర్ కట్టబెడితే.. ఊరుకునేది లేదని అంటున్నాడు. నవదీప్ కి టైటిల్ విన్నర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాడు. అతనికి బిగ్ బాస్ షో గురించి అన్ని తెలిసాక బిగ్ హౌస్ లోకి వెళ్లాడు. అలాంటి వ్యక్తికి టైటిల్ విన్నర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాడు. మరి బిగ్ బాస్ ఎవరి విన్ అయ్యి.. 50 లక్షలు గెల్చుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -