Monday, May 20, 2024
- Advertisement -

ఛార్మి కన్నీరు పెట్టుకుంది. ఎందుకంటే?

- Advertisement -

ఐఫా అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సినీ సెలబ్రెటిస్ చాలా సంతోషంగా జరుపుకున్నారు. తారల డాన్స్‌లు, పాటలతో అద్భుతంగా జరిగింది. ఇలాంటి టైమ్ లో అందరు హ్యాపిగా ఉంటారు. కానీ చార్మి ఏడిస్తున్న ఫోటో సోషల్ మీడియాలోతెగ హల్ చల్ చెస్తుంది.

ఏడుస్తున్న చార్మిని పక్కనే ఉన్న మరో ముద్దు గుమ్మ  శ్రియ శరన్ చార్మిని ఓదారుస్తుంది.  అందరు సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు డల్‍గా ఉన్నారు. ఐతే ఒక్కప్పుడు ఈ ముద్దు గుమ్మలు వరస అవకాశాలతో చాలా బిజీగా ఉండేవారు. గతకొద్ది కాలంగా అవకాశాలు అప్పుడు అప్పుడు వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే ఈ ఐఫా వేడుకలో దేవి శ్రీ ప్రసాద్ తను నాన్నకు ప్రేమతో సినిమాలో రాసి పాడిన పాట నాన్నకు ప్రేమతో అనే పాట పాడారు.

ఇటివలే దేవి శ్రీ ప్రసాద్ తండ్రి మరిణించారు. అయితే ఆయనకు అంకితమిస్తూ దేవి ఈ పాట ఈ వేడుకలో పాడాడు. ఈ పాట‍ పాడగానే అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసిన చార్మి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. తన నటనతో, అందంతో అందరిని అకట్టుకునే చార్మీకి ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్‌తో మెరుస్తున్న చార్మికి మంచి బ్రేక్ వస్తే తిరిగి ఫామ్‍లోకి వచ్చే అవకాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -