Wednesday, May 8, 2024
- Advertisement -

రుణమాఫీ అంశంపై ధర్నాలు: ఏపీ కాంగ్రెస్ నిర్ణయం

- Advertisement -

రుణమాఫీ అంశంపై ఆంద్రప్రదేశ్ లో ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఆగస్టు నాలుగో తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. రుణమాఫీపై కొత్త,కొత్త షరతులు పెడుతున్నారని ఆయన అన్నారు.

రుణమాఫీ అంశంపై ఆంద్రప్రదేశ్ లో ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఆగస్టు నాలుగో తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. రుణమాఫీపై కొత్త,కొత్త షరతులు పెడుతున్నారని ఆయన అన్నారు. అసలు ఇంతవరకు ఎప్పటి నుంచి ఈ పధకం అమలు చేస్తారో చెప్పకుండా ప్రకటనలు మాత్రం చేస్తున్నారని ఆయన అన్నారు. రుణమాఫీ అయిపోయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.రుణాలన్నిటిని రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో ప్రకటించారని, ఇప్పుడు మాత్రం పలు షరతులు పెడుతున్నారని అన్నారు.తక్షణమే ఎన్నికల ముందు చెప్పిన విధంగా రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుని అమలు చేయాలని ఆయన కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -