Wednesday, May 8, 2024
- Advertisement -

రెచ్చిపోయిన అఫ్గాని బలగాలు.. భికరపోరులో 30 మంది తాలిబన్లు ఖతం..!

- Advertisement -

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లకు, సైనిక బలగాలకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తాలిబన్​ కమాండర్లు సహా 30 మంది ముష్కరులు హతమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. అఫ్గాన్​​ తూర్పు రాష్ట్రం లాఘ్​మన్​లో ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

లాఘ్​మన్​లోని దవ్లాత్​ షా జిల్లాలో సైనికులపై మష్కరులు దాడికి యత్నించారు. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జిల్లా తాలిబన్​ ఛీప్​తో పాటు ఆరుగురు స్థానిక కమాండర్లను అధికారులు అరెస్టు చేశారు.ఖతార్​లో తాలిబన్లకు, అఫ్గాన్​ ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు సెప్టెంబర్​లో ప్రారంభమయ్యాయి.

అయినప్పటికీ.. అక్కడ హింసాత్మక ఘర్షణలు చెలరేగడం తగ్గలేదు. ఎన్నోరాష్ట్రాల్లో భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -