- Advertisement -
ఇండియన్స్ దేన్నయినా ఓ పట్టాన పట్టుకుంటే…. దాన్ని ఆ కనిపెట్టిన వాడికి కూడా విసిగొచ్చి వదిలేసే వరకు వదిలిపెట్టరనే మాట మరోసారి సాక్షాధారాలతో సహా నిరూపితమైంది.
భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో దాదాపు 47% మంది తమ విలువైన సమయాన్ని… వాట్సప్ ,వియ్ చాట్ ,హైక్ ,స్కైప్ లకే కేటాయించేస్తున్నారట. ఈవిషయాన్ని స్వీడిష్ టెలికమ్ ఎక్విప్ మెంట్ మేకర్ ఎరిక్ సన్ తాజా ఆధ్యయనంలో వెల్లడైంది.
కమ్యునికేషన్ యాప్స్ స్మార్ట్ ఫోన్ లో కీ రోల్ పోషించడంతోనే ఇది సాధ్య మైందని ఆ సంస్థ వెల్లడించింది.నిజానికి ఈ సర్వేని ఎరిక్ సన్ సంస్థ ఇండియాతో పాటు జపాన్ ,సౌత్ కొరియా,యుకె ,యుఎస్ లలో నిర్వహించింది.ఇండియాలోని 7500 మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఈసర్వేలో పాల్గొన్నారు.