- Advertisement -
సిద్ధిపేట జిల్లా రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టాటా ఏస్ , లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా మృతులంతా వర్గల్ మండలం పాములపర్తికి చెందినవారు.
టాటా ఏస్ను వెనక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో 20 మంది ఉన్నారు. చేర్యాల మండలంలో అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.