Saturday, May 4, 2024
- Advertisement -

క‌ర్న‌టాక‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఆరుగురు దుర్మ‌ర‌ణం

- Advertisement -

క‌ర్న‌టాక‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేస‌కుంది. ఈ ప్ర‌మాదంలో ఆరుగ‌రు మృతి చెంద‌గా ప‌దిమందికి గాయాల‌య్యాయి. నివారం ఉదయం హుబ్బళ్లి సమీపంలోని 63వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణీకులతో వెళ్తోన్న బస్సు, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముంబైకి చెందిన ఆరుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప‌ది మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

ప్రయాణికులతో కర్ణాటక నుంచి ముంబై వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ముంబయికి చెందిన విశ్వనాథ్ (76), దినకర్ (74), రమేశ్ జైపాల్ (70), సుమేధా (65), లహూ, సుచిత్ర (65)లుగా గుర్తించారు. వీరంతా హంపీకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయ‌ప‌డిన వారి కొంద‌రి ప‌రిస్థితి ఆందోల‌న‌క‌రంగా ఉంది.

ప్రమాదం జరిగిన తర్వాత వాహనాలు జాతీయ రహదారికి అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్ల సాయంతో వాటిని తొలగించి, వాహనాలు రాకపోకలను పునరుద్దరించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్దరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నిగేరి పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -