Monday, April 29, 2024
- Advertisement -

పాక్ హిందూ గుడి కేసులో మళ్ళీ 55 మంది అరెస్ట్..!

- Advertisement -

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌కువాలోని హిందూ దేవాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సహా 55 మంది నిందితులను ఆ దేశ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం 9 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దాడికి సంబంధించి పోలీసులు వీరిని విచారించనున్నారు.

దశాబ్దాల నాటి ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గత వారం జమైత్ ఉలేమా-ఈ-ఇస్లామ్‌ పార్టీ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 350 మందిపై కేసు నమోదు చేశారు.

ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు.. దాడి వల్ల జరిగిన నష్టాన్ని దీనికి కారణమైన వారి నుంచి భర్తీ చేయాలని ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -