- Advertisement -
ఈశాన్య భారతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. ఇంపాల్ కు సమీపంలో భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్బశాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ భూకంపం ప్రభావంతో బెంగాల్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు పొరుగుదేశం బంగ్లాదేశ్ లోను భూమి కంపించింది. భూకంప తాకిడికి భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.