Sunday, May 19, 2024
- Advertisement -

ఘోరం… పుట్టిన ప‌సిపాప‌ను వ‌ద‌ల‌ని మాన‌వ మృగం….

- Advertisement -

మైనర్‌ బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులపై జరుగుతున్న క్రూర అకృత్యాలు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆరునెలల పసిగుడ్డుపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం.

ఇండోర్‌లోని రజ్వాడా పోర్టులో శుక్రవారం జరిగిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. ఆరుబయట తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తోన్న పాపను ఎత్తుకెళ్లిన ఆరు నెలల పాపను ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు రేప్ చేసి చంపేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పాపను ఎత్తుకెళ్లిన వ్యక్తిని 21 ఏళ్ల సునీల్ భీల్‌గా గుర్తించారు.

ఓ వాణిజ్య సముదాయంలోని సెల్లార్లోకి ముక్కు పచ్చలారని చిన్నారిని తీసుకెళ్లిన యువకుడు రేప్ చేసిన అనంతరం దారుణంగా హతమార్చాడు. మధ్యాహ్నం షాపు తెరవడానికి వెళ్లిన దుకాణదారుడు రక్తపు మడుగులో పడి ఉన్న పాప శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు

శిశువు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారని, వారికి నిందితుడు పరిచయస్తుడని పోలీసులు తెలిపారు. శిశువు శరీరంలోని ప్రైవేటు భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించామని వారు వెల్లడించారు. కేసు నమోదు చేశామని, నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -