Thursday, May 2, 2024
- Advertisement -

ఆ రెండు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ.. తాజా పరిస్థితిపై సమీక్షా..!

- Advertisement -

భోపాల్​, ఇండోర్​ నగరాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నట్లు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం లేదా సోమవారం నుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించిన చౌహాన్​.. ప్రధాన నగరాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కేసులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్​ ఆదేశించారు. ప్రజలంతా వైరస్​ నిబంధనలు పక్కాగా పాటించేలా చూడాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన ప్రయాణికులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించాలని ​ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలనే అంశంపైనా చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు.ఇండోర్​లో కరోనా కేసులు 61,642కి చేరగా.. భోపాల్​లో 45,079కి పెరిగాయి.

ఆ నలుగురిపై పిడుగు పడింది.. కానీ..

కవిత అక్క రేంజ్ భలే పెరిగిందే!

బెంగాల్‌లో పోలిటిక‌ల్ హీట్‌.. తృణ‌మూల్‌ గూటికి య‌శ్వంత్ సిన్హా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -