Wednesday, May 1, 2024
- Advertisement -

కాకినాడ స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో న‌జ్జినుజ్జి అయిన ఆటో

- Advertisement -

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. గృహ‌ప్ర‌వేశానికి హ‌జ‌ర‌యి తిరిగి వెల్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకంది. టాటా ఏస్‌ను టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో ఎనిమిది మంది చనిపోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు పిఠాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర 216 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసు​కుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం బీతావహంగా ఉంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం….మృతులు విశాఖపట్నం జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో గృహప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ఈ ఘటనతో మాకవరంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -