Saturday, May 4, 2024
- Advertisement -

స‌మాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారా….

- Advertisement -

చాలా మంది సైకోల‌ను చూసింటారు కాని ఇలాంటి సైకోను చూసిండ‌రు. గ‌తంలో కుక్క‌పిల్ల‌ల‌ను మంట‌ల్లో వేసిన సైకో గురించి విన్నాం. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. పెంపుడు పిల్లుల్ని మంటల్లో వేసి పైశాచికానందం పొందాడో సైకో మానవ మృగం. మంట‌లు తాల‌లేక ప‌రిగెడుతున్న పిల్లుల్ని ప‌ట్టుకోని వ‌చ్చి బూడిద చేశాడు. అవి బాధతో అరుస్తుంటే చూస్తూ రాక్షసానందం పొందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెల్తే….ముంబ‌య్‌లోని నయా నగర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటాక సిద్ధేశ్ పటేల్‌ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ప‌క్క‌నె ఉన్న అపార్ట‌మెంట్‌లో ఉన్ని పిల్లిపిల్ల‌ల‌ను చూడ‌గానె సైకో ఆలోచ‌న వ‌చ్చింది. ఆ పిల్ల‌ల‌ను డ‌బ్బాలో వేసి నిప్పంటించాడు.పాపం ఆ మూగ జీవాలు మంటల్ని తాళలేక బయటకు పరిగెడుతుంటే.. వాటిని పట్టుకొచ్చి మళ్లీ మంటల్లో పడేశాడు. పాపం బాధతో పిల్లులు అరుస్తుంటే.. పైశాచికానందం పొందాడు.

కొద్దిసేపటి తర్వాత పిల్లుల పరిస్థితిని గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. మంటల్లో కాలిపోయిన పిల్లుల్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు . అయితే60శాతం కాలిపోవ‌డంతో వాటి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడు సిద్దార్థ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌ను స్థానికంగా వ్యాపారం చేసె వ్య‌క్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -