- Advertisement -
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ లో కర్తపు ఏరులు పారాయి. కాబూల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే.. ఇవాళ వరుసగా ఆరు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో సుమారు 66 మంది పౌరులు గాయపడ్డారు. బ్రిటీష్ పాలన నుంచి స్వాత్రంత్య్రం పొంది వందేళ్లు అయిన నేపథ్యంలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో వేడుకలు జరుగుతున్నాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, పబ్లిక్ ప్రాంతాల్లోనే ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 70 మంది వరకు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రపంచ దేశాల సాయాన్ని కోరారు. మిలిటెంట్ల ఏరివేతకు అంతర్జాతీయ దేశాలు సహకరించాలన్నారు. ఐఎస్కు సంబంధించిన దయిస్ను తరిమేందుకు పోరాటం చేస్తామన్నారు.