Sunday, May 19, 2024
- Advertisement -

సేవ‌లోనూ ఐశ్వ‌ర్య‌మే

- Advertisement -
  • వంద మంది చిన్నారుల గ్ర‌హ‌ణం మొర్రికి చికిత్స‌
  • తండ్రి జ్ఞాప‌కంగా సేవా కార్య‌క్ర‌మం

బ‌చ్చ‌న్ కోడ‌లు, ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ సేవ‌లోనూ ఆద‌ర్శంగా నిలుస్తోంది. త‌న తండ్రి కృష్ణ‌రాజ్‌ రాయ్ ప్రారంభించిన సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్త‌నంటోంది. అందులో భాగంగా గ్ర‌హ‌ణం మొర్రితో జ‌న్మించిన వంద మంది చిన్నారుల శ‌స్ర్త‌చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చు అంతా తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించింది. తన తండ్రి జయంతి సందర్భంగా ఒక మహాత్కార్యం చేపట్టనుంది. ఈరోజు చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే భావనతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణంమొర్రితో జన్మించిన చిన్నారులకు పై పెదవి చీలినట్టు తయారవుతుంది. స్మైల్ ట్రైన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. ఈ స్వచ్ఛంద సంస్థకు ఐశ్వర్య ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. గ‌త మార్చి నెల‌లో ఆమె కృష్ణ‌రాజ్ రాయ్ మృతి చెందాడు. ఆయ‌న మ‌ర‌ణం ఆమెను తీవ్రంగా క‌ల‌చివేసింది. ఇప్ప‌టికీ ముభావంగానే ఉంటోంది. తండ్రి జ్ఞాప‌కంగా ఈ సేవా కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది.

2014లో ఐశ్వర్య తండ్రి కృష్ణ‌రాజ్ రాయ్ కూడా 100 మంది గ్రహణం మొర్రి చిన్నారుల వైద్యచికిత్సకు అయ్యే ఖర్చును భరించారు. ఆయ‌న బాట‌లోనే తాను న‌డుస్తాన‌ని ప్ర‌క‌టించి ఆ విధంగా ముందుకు వెళ్తోంది. ఐశ్వర్య.. తన తల్లి వృందారాయ్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌లతో కలసి ముంబైలోని ఆపస్ప‌త్రులను సందర్శించి అక్కడున్న గ్రహణం మొర్రి బాధితులను కలుసుకోనున్నారు.

https://www.youtube.com/watch?v=qU9rT8pgQ_U

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -