Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు పర్యటన లో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది

- Advertisement -
AK-47 Gun Misfire Kills Constable At AP CM Chandrababu meeting

కర్నూలు లో చంద్రబాబు పర్యటన విషాదంగా పూర్తి అయ్యింది. సీఎం పర్యటన సందర్భంగా బందో బస్తు కి వచ్చిన ఒక కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ అయ్యి మరొక కానిస్టేబుల్ మరణించాడు. ఇదే ఘటన గురించి కొత్త వార్తలు, సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.

అనంతపురం జిల్లా కానిస్టేబుల్ హంపన్న స్పెషల్ పార్టీ బృందం లో పని చేస్తూ ఉంటాడు. సోమవారం తడకనపల్లి కి వచ్చిన చంద్రబాబు పర్యటన కి అతను కూడా బందోబస్తు లో ఉన్నాడు.  సీఎం సభాస్థలికి అరకిలోమీటరు దూరంలో విధులు నిర్వర్తించిన హంపన్నతో పాటు మరో ఇద్దరుకానిస్టేబుళ్లు సైతం విధులు నిర్వహించారు.మధ్యాహ్నం 2.30 గంటల వేళలో.. వారంతా భోజనానికి కూర్చున్నారు. ఆ సందర్భంగా హంపన్న సెల్ మాట్లాడుతున్నారు.

ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లిన హంపన్న.. పది నిమిషాల వ్యవధిలో తుపాకీ పేలిన శబ్దం రావటం.. పరుగున వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లకు.. రక్తపు మడుగులో ఉన్న హంపన్న కనిపించారు. ఫోన్ మాట్లాడుతున్న సందర్భంగా అతని తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా? కావాలనే తుపాకీ పేల్చుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -