భారతదేశంలో అపర కుబేరుడు ఎవరంటే రిలయల్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. సామాన్యుల ఆదాయం పెరగకున్నా ఆయన సంపాదన మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. తన వ్యాపర సామ్రాజ్యానికి వారసుడిగా తన కుమారుడు అనంత్ అంబానీని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ల ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది.
తన కుమారుడు అనంత్అంబానీని అతిపెద్ద వజ్రాల కంపెనీ అయిన రోజీ బ్లూ డైమండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాకు ఇచ్చి వివాహం చేస్తున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక శనివారం (మార్చి 14) ఘనంగా జరిగింది. స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో గోవాలో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవల విడుదల చేశారు. అంబానీ తనకు కాబోయే కోడలికి మిఠాయి తినిపిస్తూ కనపించాడు. శ్లోకా, అనంత్ అంబానీ ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహం ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. డిసెంబర్లో స్విట్జర్లాండ్లో ఘనంగా వివాహం చేయనున్నారు.